కోల్కతా, సందేశ్ఖాలి, ఫిబ్రవరి 26: సందేశ్ఖాలీ లైంగిక దాడులు, భూ కబ్జాల కేసులో నిందితుడైన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు షాజహాన్ షేక్ను అరెస్ట్ చేయాలని ఆ రాష్ట్ర హైకోర్ట్ సోమవారం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అతడిపై దాఖలైన కేసులపై తాము ఎలాంటి స్టే విధించలేదని స్పష్టం చేసింది. నాలుగేండ్ల క్రితమే నిందితుడిపై లైంగిక దాడులు ఆరోపణలు వచ్చినా.. సంబంధిత కేసుల్లో చార్జ్షీట్లు దాఖలు చేయడానికి నాలుగేండ్లు పట్టడంపై కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. సందేశ్ఖాలీవాసుల నుంచి వందలాది ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో బాధితుల ఆరోపణలను కోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది.మరోవైపు హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో షాజహాన్ షేక్ను వారంలో అరెస్ట్ చేస్తామని తెలిపింది. దోషులకు తమ పార్టీ మద్దతు తెలపదని వెల్లడించింది.
రాజకీయ పార్టీపైనా పరువునష్టం కేసు వేయొచ్చు