న్యూఢిల్లీ, జూన్ 24: దేశంలో రోడ్డు భద్రతను పెంపొందించడానికి, ప్రమాదాల్లో మరణాల శాతాన్ని తగ్గించడానికి కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి గడ్కరీ తెలిపారు. ‘భారత్ ఎన్సీఏపీ (భారత్ కొత్త కారు అంచ నా కార్యక్రమం)’ పేరిట క్రాష్ టెస్టులు నిర్వహించి వాటి ఫలితాల ఆధారంగా వాహనాలకు స్టార్ రేటింగ్స్ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. దీంతో వినియోగదారులు అత్యంత భద్రతతో కూడిన వాహనాలను ఎంపిక చేసుకోవడానికి వీలు కలుగుతుందన్నారు. ఈ మేరకు డ్రాఫ్ట్ జీఎస్ఆర్ నోటిఫికేషన్ను ఆమోదించినట్టు ట్వీట్లు చేశారు.
కొత్త విధా నం వల్ల వాహన తయారీ కంపెనీల మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్లోబల్ క్రాష్ టెస్టు ప్రమాణాలకు అనుగుణంగా భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్లు ఉంటాయన్నారు. కార్ల ఎగుమతుల పెరుగుదలతో పాటు, వాహన రంగం స్వయంసమృద్ధి సాధనకు ఈ విధా నం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కాగా, తాజా విధానం ద్వారా వాహనాలకు 1 నుంచి 5 వరకు స్టార్ రేటింగ్స్ ఇవ్వనున్నారు. సేఫ్టీ ప్రొటోకాల్స్ పాటిస్తూ తయారైన కారుకు క్రాష్ టెస్టు నిర్వహించి ఎక్కువ స్టార్లు ఇస్తారు. 2020లో దేశవ్యాప్తంగా 3,66,138 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 1,31,714 మంది మరణించారు.