గుర్తించాలని ప్రధానికి సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
చెన్నై, మే 26: హిందీపై దేశవ్యాప్తంగా తీవ్ర వివాదం నడుస్తున్న వేళ ప్రధాని మోదీ సమక్షంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రప్రభుత్వ విభాగాల కార్యకలాపాల్లో హిందీతో సమానంగా తమిళాన్ని కూడా అధికార భాషగా గుర్తించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
మద్రాస్ హైకోర్టులో తమిళాన్ని అధికార భాష చేయాలన్నారు. మోదీ గురువారం చెన్నైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోదీ, స్టాలిన్ ఒకే వేదికను పంచుకొన్నారు. ముందుగా స్టాలిన్ మాట్లాడారు. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని కోరారు. రాష్ర్టాలకు జీఎస్టీ పరిహారం గడువును పెంచాలని, రాష్ర్టాలకు చెల్లించాల్సిన జీఎస్టీ బకాయిలను విడుదల చేయాలని అడిగారు. కచ్చతీవు దీవిని శ్రీలంక నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరారు. రాష్ర్టాల్లో అభివృద్ధి ప్రాజెక్టులు, పథకాలకు కేంద్రం నిధుల పంపిణీ పెంచాలన్నారు. స్టాలిన్ అనంతరం మోదీ మాట్లాడారు. ‘తమిళ భాష నిత్యమైనది. శాశ్వతమైనది. తమిళ సంస్కృతి విశ్వ వ్యాపితమైనది’ అని వ్యాఖ్యానించారు.