జైపూర్: మంత్రిని సన్మానిస్తుండగా వేదిక కూలిపోయింది. (Stage collapses) ఈ సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. రాజస్థాన్లోని కోటా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన హీరాలాల్ నగర్ జనవరి 5న తన నియోజకవర్గం సంగోత్కు తొలిసారి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రిని సన్మానించేందుకు ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు.
కాగా, కేవలం 15 మంది ఎక్కేందుకు ఏర్పాటు చేసిన వేదికపైకి 40 మందికిపైగా ఎక్కారు. దీంతో మంత్రి హీరాలాల్ మెడలో పూలమాట వేస్తుండగా ఆ వేదిక కూలిపోయింది. ఈ నేపథ్యంలో పలువురు గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి సీరియస్గా ఉన్న వారికి మెరుగైన చికిత్స కోసం జైపూర్లోని ఆసుపత్రికి తరలించారు. మంత్రి హీరాలాల్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
VIDEO | Stage set for the felicitation of Rajasthan minister Heeralal Nagar in Kota collapsed yesterday night, resulting in four injuries. pic.twitter.com/5M3J7YZWjE
— Press Trust of India (@PTI_News) January 5, 2024