శ్రీనగర్: ప్రతికూల వాతావరణం కారణంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా జోజిలా పాస్ను మూసివేశారు. శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై జమ్ముకశ్మీర్, లఢక్లను కలుపుతూ జోజిలా పాస్ ఉంది. అయితే శీతాకాలంలో ఇక్కడ తీవ్రంగా మంచుకురుస్తుంది. దాంతో తరచూ హిమపాతం సంభవిస్తుంది. ఇది వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తుంటుంది.
అందుకే ప్రతి శీతాకాలంలో ఎక్కువ మంచు కురిసే సమయంలో జోజిలా పాస్ను మూసేస్తారు. అయితే ప్రతి ఏడాది జనవరి 2, 3 తేదీలకల్లా వాతావరణం ప్రతికూలంగా మారేది. ఈసారి కూడా ప్రతికూలంగానే ఉన్నా బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అధికారులు ఎప్పటికప్పుడు మంచు తొలగింపు చర్యలు చేపడుతూ వాహనాల రాకపోకలను కొనసాగించారు.
ప్రస్తుతం పరిస్థితి మరింత తీవ్రంగా కావడంతో ఇవాళ్టి నుంచి జోజిలాపాస్ను పూర్తి మూసేశారు. కశ్మీర్, లఢక్ మధ్య 11,643 కిలోమీటర్ల ఎత్తులో జోజిలా పాస్ ఉన్నది. ఈ జోజిలా పాస్ మూసివేతపై కశ్మీర్ డివిజనల్ కమిషనర్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.