Punjab Polls : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పర్యటన రోజే పంజాబ్ కాంగ్రెస్లో చీలిక వచ్చింది. పంజాబ్లోని ఓ వర్గం ఏకంగా రాహుల్ గాంధీకే ఝలక్ ఇచ్చారు. ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ పర్యటనను బాయ్కాట్ ,చేయాలని నిర్ణయించుకున్నారు . అందులో మనీశ్ తివారీ, రవనీత్ బిట్టూ, జస్బీర్ డింపా, మహ్మద్ సిద్దిఖీ, పరణీక్ కౌర్ బాయ్కాట్ జాబితాలో వున్నారు. పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ గురువారం పంజాబ్ పర్యటనకు వెళ్లారు. అమృత్సర్ చేరుకున్నారు. సీఎం చెన్నీ, పీసీసీ అధ్యక్షుడు సిద్దూ అగ్రనేత రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు. ఆ తర్వాత జలియన్ వాలాబాగ్ సందర్శనకు వెళ్లారు. అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు.
మరోవైపు ఈ ఎంపీలు రాహుల్ గాంధీ పర్యటనను బాయ్కాట్ చేయడంపై అధిష్ఠానం స్పందించింది. కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ… ఈ వార్తను కొట్టిపారేశారు. అవన్నీ పుకార్లేనని అన్నారు. అవన్నీ నిరాధారమైన ఆరోపణలు అని కొట్టిపారేశారు.