న్యూఢిల్లీ: దివాళా కోసం దరఖాస్తు చేసుకోవాలన్న ప్రణాళికలు తమకు లేవని స్పైస్జెట్(SpiceJet) సంస్థ వెల్లడించింది. ఇటీవల గోఫస్ట్ విమాన సంస్థ స్వచ్చంధ దివాళా కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. నిధులను సమీకరించేందుకు తమ ఇన్వెస్టర్లతో నిత్యం సంప్రదింపుల్లో ఉన్నట్లు స్పైస్జెట్ పేర్కొన్నది. తమ ఫ్లీట్లో గ్రౌండ్ చేసిన 25 విమానాలను స్వంత ఖర్చులతో మళ్లీ సర్వీసులోకి తీసుకురానున్నట్లు ఆ సంస్థ చెప్పింది. భారతీయ ప్రభుత్వం నుంచి లైన్ ఆఫ్ క్రెడిట్ కింద సుమారు 50 మిలియన్ల డాలర్లు సెక్యూర్ చేయనున్నట్లు స్పైస్జెట్ తెలిపింది.