న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి పుణె వెళ్తున్న స్పైస్ జెట్ విమానానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. విమానంలో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తులు ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సాయంత్రం 6:30 గంటలకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో అప్రమత్తమైన ఎయిర్పోర్టు సిబ్బంది.. విమానాన్ని అత్యవసరంగా ఆపారు. అనంతరం బాంబ్ స్క్వాడ్, ఎయిర్లైన్ అధికారులు కలిసి విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విమానంలో ఎలాంటి బాంబు లేదని అధికారులు తేల్చారు. దీంతో అటు ఎయిర్పోర్టు సిబ్బంది, ఇటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.