విమాన ప్రయాణ టికెట్లు కనీసం 10-15 శాతం పెంచేందుకు అనుమతించాలని ప్రైవేట్ విమానయాన సంస్థ స్పైస్జెట్ కేంద్రాన్ని కోరింది. అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ భారీగా పతనం కావడంతో ఏవియేషన్ టర్బైన ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో కనీసం విమాన ప్రయాణ టికెట్ల ధరలు 10-15 శాతం పెంచేందుకు అనుమతించాలని బడ్జెట్ క్యారియర్ స్పైస్జెట్ డిమాండ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
డాలర్తో రూపాయి మారకపు విలువ పడిపోవడం, ఫ్యూయల్ ధరలు అధికమవడంతో సంస్థకు నిర్వహణ వ్యయం పెరిగిందని, తప్పనిసరి పరిస్థితుల్లోనే టికెట్ ధరలు పెంచనున్నామని అని జెట్ ఎయిర్వేస్ సీఎండీ అజయ్ సింగ్ తెలిపారు. దీనివల్ల తమకు కొంతవరకు భారం తగ్గుతుందని చెప్పారు.
2021 జూన్ 21 తర్వాత ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) రెట్లు 120 శాతం అధికమయ్యాయని, ఇది మోయలేని భారంగా మారిందని అజయ్ సింగ్ పేర్కొన్నారు. నిర్వహణ వ్యయంలో ఇదే 50 శాతం ఉంటుందన్నారు. అందువల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను తగ్గించుకోవాలని కోరారు. అదేవిధంగా రూపాయి విలువ పడిపోవడం కూడా తమపై ప్రభావం చూపుతున్నదని అజయ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.