న్యూఢిల్లీ: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన(యూబీటీ)లో చీలిక అనివార్యమని ఊహాగానాలు సాగుతున్న వేళ శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ-ఎస్పీ)లో మరోసారి తిరుగుబాటు జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్సీపీ(ఎస్పీ)కి చెందిన పలువురు ఎంపీలు అజిత్ పవార్ వర్గంతో మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. దీంతో మహారాష్ట్రలో మరో భారీ రాజకీయ పునరేకీకరణ జరగవచ్చన్న ఊహాగానాలు జోరందుకున్నాయి.
అజిత్ వర్గంతో కొంద రు ఎంపీలు, ఎమ్మెల్యేలు చర్చలు జరుపుతున్నమాట వాస్తవమేనని ఎన్సీపీ(ఎస్పీ)కి చెందిన పలువురు నాయకులు ధృవీకరించారు. శరద్ వర్గానికి చెందిన సుమారు ఐదుగురు ఎంపీలు వైరి వర్గం నాయకులతో సంప్రదింపులు సాగిస్తున్నట్లు పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ధర్మారావు బాబా ఆత్రమ్ వెల్లడించారు. లోక్సభలో ప్రస్తుతం ఎన్సీపీ(ఎస్పీ)కి 8 మంది ఎంపీలు ఉన్నారు.