న్యూఢిల్లీ, డిసెంబర్ 28: వచ్చే నెల 3 నుంచి ప్రారంభం కానున్న పిల్లల వ్యాక్సినేషన్ (15-18 ఏండ్ల మధ్య) కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం తెలిపింది. త్వరలో 5 రాష్ర్టాల్లో జరుగనున్న ఎన్నికల విధుల్లో పాల్గొనే వారిని ఫ్రంట్లైన్ క్యాటగిరీలో చేర్చుతూ.. వారికి ప్రికాషన్ డోసు వేస్తామని తెలిపింది. రెండో డోసు తర్వాత 9 నెలల పూర్తయిన వారికి మూడో డోసు వేస్తామని వివరించింది. మూడో డోసు కార్యక్రమం వచ్చే నెల 10 నుంచి ప్రారంభం కానుంది.