హైదరాబాద్ : ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్షలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. జూన్ 12, 13, 14 తేదీల్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్షను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు.. అభ్యర్థులకు సూచించారు.
శాలిమార్ – సికింద్రాబాద్(08005) ఎక్స్ప్రెస్ జూన్ 11న ఉదయం 6 గంటలకు శాలిమార్ స్టేషన్లో బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్కు చేరుకోనుంది. సికింద్రాబాద్ – శాలిమార్(08006) ఎక్స్ప్రెస్ జూన్ 14న మధ్యాహ్నం 2:30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి 9:20 గంటలకు శాలిమార్ చేరుకోనుంది.
ఈ ప్రత్యేక రైళ్లు సంత్రగచ్చి, ఖరగ్పూర్, బాలాసోర్, భద్రక్, జాజ్పూర్ కోయింజార్ రోడ్, కటక్, భువనేశ్వర్, ఖుద్రా రోడ్, బ్రహ్మపూర్, పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, విశాఖపట్టణం, రాజమండ్రి, విజయవాడ, గుంటూర్ స్టేషన్లలో ఆగనున్నాయి.
బిలాస్పూర్ – సికింద్రాబాద్(08819) ఎక్స్ప్రెస్ జూన్ 11న ఉదయం 8:15 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 10:35 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది. సికింద్రాబాద్ – బిలాస్పూర్(08820) ఎక్స్ప్రెస్ జూన్ 14న రాత్రి 9:30 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు బిలాస్పూర్ చేరుకోనుంది.
ఈ ప్రత్యేక రైళ్లు భటపర, రాయ్పూర్, దుర్గ్, రాజ్ నందగావ్, డోన్గర్గర్హ్, గొండియా, బాల్హర్షహ్, కాజీపేట స్టేషన్లలో ఆగనున్నాయి.
భువనేశ్వర్ – తంబరాం(08407) ఎక్స్ప్రెస్ జూన్ 11న ఉదయం 10:30 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 7:15 గంటలకు తంబరాం చేరుకోనుంది. తంబరాం – భువనేశ్వర్(08408) ఎక్స్ప్రెస్ జూన్ 12న ఉదయం 10:30 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 7 గంటలకు భువనేశ్వర్ చేరుకోనుంది.
ఈ ప్రత్యేక రైళ్లు ఖుద్రా రోడ్, బ్రహ్మపూర్, పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, విశాఖపట్టణం, దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, గుడూరు, చెన్నై ఎగ్మోర్ స్టేషన్లలో ఆగనున్నాయి.