చెన్నై, నవంబర్ 18: ఇస్రోకు చెందిన జీశాట్-20(జీశాట్-ఎన్2) ఉపగ్రహం ఈనెల 18న యూఎస్ కాలమాన ప్రకారం సాయంత్రం 6.31 గంటలకు (భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 12.01 నిమిషాలకు) స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లనుంది. ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ ఇందుకు వేదిక కానుందని ఇస్రో చైర్మన్ సోమ్నాథ్ వియాన్ వార్తా సంస్థకు వెల్లడించారు.
బ్యాకప్ ప్రయోగ తేదీగా యూ ఎస్ కాలమాన ప్రకారం మంగళవారం ఉద యం 9.33 గంటలను ఎంపిక చేశారు. 4.7 టన్నుల బరువైన ఈ కమ్యూనికేషన్ ఉపగ్రహం అండమాన్ నికోబార్, లక్షద్వీప్తోపాటు భారత్ మొత్తాన్ని కవర్ చేసి బ్రాడ్బ్యాండ్ సేవలను అందిస్తుంది. భారత దేశ రాకెట్లు 4 వేల కిలోలు బరువు గల ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీశాట్-20ని స్పేస్ ఎక్స్కు చెందిన రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు.