న్యూఢిల్లీ: ఎయిర్పోర్టు కౌంటర్లలో స్పైస్జెట్ సహా కొన్ని ఎయిర్లైన్స్ బోర్డింగ్ పాస్పై రూ.200 అదనంగా వసూలు చేస్తున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తటంతో కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. వీలైనంత త్వరగా ఫిర్యాదులపై విచారణ చేయిస్తానని వెల్లడించారు.
కొన్ని విమానయాన సంస్థలు వెబ్ చెన్-ఇన్ చేయాలని పట్టుబట్టడమే కాకుండా, అలా చేయటంలో విఫలమైతే ప్రయాణికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేస్తున్నాయని పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.