లక్నో : మొయిన్పురి లోక్సభ ఉప ఎన్నికలో కాషాయ పార్టీని మట్టికరిపించి ఘన విజయం సాధిస్తామని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. మొయిన్పురిలో బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతోందని ఆరోపించారు.
ఈ ఎన్నికలో గెలుపొంది ములాయం సింగ్ యాదవ్కు నివాళి అర్పిస్తామని అఖిలేష్ పేర్కొన్నారు. ఎస్పీ వ్యవస్ధాపకుడు ములాయం మరణంతో మొయిన్పురి లోక్సభ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎస్పీ కంచుకోట మొయిన్పురిని నిలుపుకునేందుకు ఆ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఎస్పీ అభ్యర్ధిగా డింపుల్ యాదవ్ బీజేపీ అభ్యర్ధి రఘురాజ్ సింగ్ సఖ్యతో ద్విముఖ పోరులో తలపడుతున్నారు. మొయిన్పురిలో తమ పార్టీ అభ్యర్ధిని గెలిపించుకునేందుకు పాలక బీజేపీ చెమటోడుస్తోంది.