కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప మనవరాలు డాక్టర్ సౌందర్య(30) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం బెంగళూరులోని అపార్ట్మెంట్లో సౌందర్య ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులోని బౌరింగ్ ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తోంది. నీరజ్ అనే రేడియాలజిస్ట్ను పెళ్లిచేసుకుంది.
సౌందర్యకు 9 నెలల కూతురు ఉంది. ఆమె ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేరు కానీ.. కూతురు తనతోనే ఉంది. పనిమనిషి కిచెన్లో పనిచేస్తూ ఉంది. కూతురును పక్కనే పెట్టుకొని సౌందర్య ఆత్మహత్య చేసుకున్నదా అనే అనుమానాలు రాగా.. ఆత్మహత్య చేసుకోవడం కోసం కూతురును పక్క రూమ్లో వదిలేసి రూమ్కు వచ్చి సౌందర్య ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.
మూడు నెలల క్రితమే కూతురుకు పేరు పెట్టి.. ఆ ఫంక్షన్ను సౌందర్య ఘనంగా నిర్వహించింది. భార్యాభర్తలు ఇద్దరూ చాలా సంతోషంగా ఉండేవారని.. వాళ్ల మధ్య ఎటువంటి కలహాలు కూడా లేవని తెలుస్తోంది. పనిమనిషి ఇచ్చిన సమాచారంలో రంగంలోకి దిగిన పోలీసులు.. సౌందర్య సూసైడ్పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.