న్యూఢిల్లీ: అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయాన్ని .. జనవరి 22వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలకు ఆహ్వానాలు వెళ్లాయి. అయితే ఆ ఈవెంట్కు కాంగ్రెస్ నేత సోనియా గాంధీ(Sonia Gandhi) హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. రామజన్మభూమిలో ఆలయ ప్రారంభోత్సవానికి రావాలంటూ సోనియాతో పాటు కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే, ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరీలకు ఆహ్వానం వెళ్లింది. వచ్చే ఏడాది ఆరంభంలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ అంశం కీలకంగా మారింది. మతపరమైన అంశం కావడంతో కాంగ్రెస్ పార్టీ ఎలా అయోధ్య ఇన్విటేషన్పై రియాక్ట్ అవుతుందన్న సందేహాలు ఉండే. కాంగ్రెస్ పార్టీ నేతలు భిన్నఅభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు.