న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇవాళ లోక్సభలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ సోనియా గాంధీ(Sonai Gandhi) మాట్లాడారు. మహిళా బిల్లుకు తాము మద్దతు ఇస్తున్నట్లు ఆమె చెప్పారు. భారతీయ మహిళల జీవన ప్రయాణం గురించి ఆమె ప్రస్తావించారు. భారతీయ మహిళల త్యాగాలను గుర్తించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. దేశ చరిత్రలో ఎంతో మంది మహిళామణులు ఉన్నారని, సరోజినీ నాయుడు, సుచిత్రా క్రిపలాని దేశం కోసం పోరాడారని, మహాత్మా గాంధీ, అంబేద్కర్ చూపిన మార్గంలో వాళ్లు నడిచారన్నారు.
#WATCH | Women’s Reservation Bill | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi says, “…On behalf of Indian National Congress, I stand in support of Nari Shakti Vandan Adhiniyam 2023…” pic.twitter.com/BrzkEkba8G
— ANI (@ANI) September 20, 2023
కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పిన సోనియా గాంధీ.. దేశవ్యాప్తంగా జనగణన కూడా చేపట్టాలన్నారు. భారత నారీ శక్తి ఎంతో ఘనమైందని, స్త్రీల త్యాగాలు ఎనలేనివని, మహిళా బిల్లును తక్షణమే అమలు చేయాలని ఆమె కోరారు. భారతీయ కాంగ్రెస్ పార్టీ తరపున నారీ శక్తి బందన్ అదినియంను సమర్ధిస్తున్నట్లు తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీలను కూడా చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. కుల గణనను కూడా చేపట్టి, బిల్లును వెంటనే అమలు చేయాలన్నారు.
#WATCH | Women’s Reservation Bill | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi says, “This is an emotional moment of my own life as well. For the first time, Constitutional amendment to decide women’s representation in local body election was brought by my life partner… pic.twitter.com/stm2Sggnor
— ANI (@ANI) September 20, 2023
తన జీవితంలో ఇది భావోద్వేగ సందర్భమని, స్థానిక ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు రాజ్యాంగ సవరణ చేపట్టామని, తన భర్త రాజీవ్ గాంధీ ఆ సవరణ తీసుకువచ్చారన్నారు. తొలుత రాజ్యసభలో ఆ సవరణను ఓడించారని, కానీ పీవీ నర్సింహారావు సర్కార్లో ఆ బిల్లు పాసైందన్నారు. ఆ బిల్లు ఫలితంగా దేశవ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది మహిళలు స్థానిక ఎన్నికల్లో నేతలుగా మారినట్లు చెప్పారు. రాజీవ్ గాంధీ స్వప్నం సగం పూర్తి అయ్యిందని, ఈ బిల్లుతో ఆ స్వప్నం సాకారం అవుతుందన్నారు.