న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మాతృమూర్తి పోలా మినో కన్నుమూశారు. ఆమె వయసు 90ఏండ్లు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇటలీలోని తన స్వగృహంలో గత నెల 27న మృతిచెందారు. 30న అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్వీట్టర్ ద్వారా తెలిపారు.
సీఎం కేసీఆర్ సంతాపం
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): పోలా మినో మృతికి సీఎం కేసీఆర్ సంతాపం తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తల్లిని కోల్పోయిన సోనియా గాంధీకి, వారి కుటుంబానికి సీఎం తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.