న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని తెలుస్తున్నది. రాజ్యసభ ఎన్నికలకు పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సోమవారం పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు. సోనియాగాంధీ, పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ రాజ్యసభకు పోటీ చేసే అవకాశం ఉన్నదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఖాళీ అయ్యే స్థానం నుంచి పోటీలో సోనియాగాంధీ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. 15 రాష్ర్టాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల జరుగనున్నాయి. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు. ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఇంకా తేలనప్పటికీ సోనియా మాత్రం ఈ సారి రాజ్యసభకు ఎన్నికవుతారని సమాచారం.