Punjab Polls : పంజాబ్లో ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్ కృత నిశ్చయంతో ఉంది. ఆమ్ఆద్మీ చొచ్చుకొస్తున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవర్ని ప్రకటించాలని అధిష్ఠానం తీవ్ర కసరత్తే చేస్తోంది. పంజాబ్ సీఎం ఎవరన్నది ప్రజలే నిర్ణయిస్తారని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పష్టం చేసినా, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది సోనియా గాంధీ కనుసన్నల్లోనే తేల్చేయనున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి చెన్నీయా? లేదంటే పీసీసీ అధ్యక్షుడు సిద్దూయా? అన్న విషయాన్ని సోనియా గాంధీ తేల్చనున్నారు. ఈ వారం సోనియాగాంధీ ఈ విషయాన్ని తేల్చేయనున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వచ్చే వారం పంజాబ్ ముఖ్యులతో సోనియా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.