ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ను ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. సీడబ్ల్యూ సమావేశం జరిగి… రెండు రోజులైన తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు వెంటనే తమ పదవులకు రాజీనామాలు చేయాలని ఆదేశించారు. మొన్నటికి మొన్నే పంజాబ్ పీసీసీ అధ్యక్ష బాధ్యలు చేపట్టిన నవజ్యోత్ సింగ్ సిద్దూ కూడా ఈ జాబితాలో ఉన్నారు.
యూపీ, గోవా, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు ఈ జాబితాలో ఉన్నారు. ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ… వెంటనే ఆయా రాష్ట్రాల అధ్యక్షులు రాజీనామాలు అధిష్ఠానానికి సమర్పించాలని సోనియా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ప్రకటించారు.