న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ జైరాం రమేశ్ (Jairam Ramesh) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఇంగిష్ భాషపై అపారమైన పట్టున్న ఆయన ఆయా అంశాలపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సందిస్తారు. కొత్తకొత్త పదాలను కూడా సృష్టిస్తూ వాటిపై చర్చ జరిగేలా చేస్తారనే విషయం తెలిసిందే. సోషల్ మీడియాపై మంచి అవగాహన ఉన్న ఆయనకు కాంగ్రెస్ పార్టీ సరికొత్త బాధ్యతలు అప్పజెప్పింది. పార్టీకి చెందిన కమ్యూనికేషన్, పబ్లిసిటీ అండ్ మీడియా, సోషల్ మీడియా వింగ్ కు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. జైరాంను చీఫ్గా నియమించారు.
పార్టీ సంస్కరణల్లో భాగంగా కమ్యూనికేషన్ వింగ్ను మరింత పటిష్టం చేయాలని సోనియా నిర్ణయించారు. దీంతో ఈ కీలకమైన బాధ్యతలను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జైరాం రమేశ్ అప్పగించారు. ఇప్పటివరకు కమ్యూనికేషన్ వింగ్ను నడిపించిన రణ్దీప్ సుర్జేవాలను తప్పించారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. గతనెలలో ఉదయ్పూర్లో జరిగిన చింతన్ శిభిర్లో తీసుకున్న నిర్ణయాల మేరకు ఈ మార్పు చేశారు.