న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12 : లద్దాఖ్కు చెందిన భూమి, సంస్కృతి, పర్యావరణం, స్థానిక పాలన కోసం బలమైన రక్షణ చర్యలను కోరుతూ ఈ నెల 19 నుంచి ‘లేహ్ చలో ఆందోళన్’కు వాతావరణ కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్ పిలుపునిచ్చారు. వాంగ్చుక్ ప్రకటనపై స్పందించిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. అలాగే దేశవ్యాప్తంగా ప్రజలు ఈ ఆందోళనకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. మనమంతా లద్దాఖ్కు అండగా నిలవాలి! లద్దాఖ్ను కాపాడండి అని ఎక్స్ వేదికగా దాస్ పేర్కొన్నారు.
ఢిల్లీ నుంచి శుక్రవారం విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో ఈ నెల 19 నుంచి లేహ్ చలో ఆందోళన్ను వాంగ్చుక్ ప్రకటించారు. లద్దాఖ్ భూమి, సంస్కృతి, స్థానిక పాలన పరిరక్షణకు సంబంధించి కీలకమైన హామీ ఇవ్వడంలో కేంద్రం విఫలమైతే ఈ ఉద్యమం దేశవ్యాప్త నిరసనగా మారుతుందని ఆయన కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్ సంస్కృతి, ప్రకృతి, భూమి పరిరక్షణకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో చర్చలు జరిపేందుకు లద్దాఖ్ ప్రతినిధులు ఢిల్లీకి వచ్చారని ఆయన తెలిపారు.