న్యూఢిల్లీ : లడఖ్ హక్కుల సాధన, విద్యా రంగంలో జవాబుదారీతనం కోరుతూ దేశ రాజధాని ఢిల్లీలో జూన్ 28 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు చేయనున్నట్లు ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ గురువారం ప్రకటించారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేస్తున్న డిమాండ్ను అంగీకరించడం, లడఖ్కు అదనపు అధికారాలు కల్పించడం.. ఈ రెండింటిలో కనీసం ఒక్క డిమాండ్నైనా జూన్ 27 లోగా ప్రభుత్వం నెరవేర్చాలని, లేని పక్షంలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తానని వాంగ్ చుక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.