Ahmedabad | అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లోని గుజరాత్ యూనివర్సిటీలోని హాస్టల్లో నమాజ్ చేస్తున్న విదేశీ విద్యార్థులపై కొందరు దాడి చేశారు. ఇందులో శ్రీలంక, తజకిస్థాన్కు చెందిన ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. 75 మంది విదేశీ విద్యార్థులు ఎ బ్లాక్ హాస్టల్లో ఉన్నారు.
శనివారం రాత్రి కొందరు నమాజ్ చేస్తుండగా ఈ దాడి జరిగింది. మసీదులో నమాజ్ చేసుకోవాలని దుండగులు విద్యార్థులను హెచ్చరించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.