కోల్కతా: పశ్చిమబెంగాల్ బీజేపీ నేతల తీరుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జి ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ నేతలు అనే పదాన్ని ఉచ్ఛరించకుండా.. ‘కొంత మంది పశ్చిమబెంగాల్లోనే ఉంటున్నారు. ఇక్కడే తింటున్నారు. పైగా బెంగాల్కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు. బెంగాల్కు ఢిల్లీ (కేంద్ర సర్కారు) డబ్బులివ్వదని మాట్లాడుతున్నారు’ అని మండిపడ్డారు.
అయినా తనకు ఢిల్లీ నుంచి వచ్చే డబ్బులు అవసరం లేదని మమతాబెనర్జి వ్యాఖ్యానించారు. బెంగాల్కు తన కాళ్లపై తాను నిలబడే సామర్థ్యం ఉన్నదని చెప్పారు. తమ ఆత్మగౌరవమే తమకు ముఖ్యమని, దాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఢిల్లీ చేతుల్లోకి వెళ్లనివ్వమని మమత పేర్కొన్నారు.