Encounter | జమ్మూ కశ్మీర్లోని ఉధంపూర్ మారుమూల అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల సంచరిస్తున్నారన్న సంచారం మేరకు భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలో బలగాలను గమనించిన ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఓ సైనికుడు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం తెల్లవారు జామున ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం సాయంత్రం ఉధంపూర్లోని దూదు-బసంత్గఢ్ ప్రాంతంలోని సియోజ్ ధార్ అటవీ సరిహద్దు వద్ద సైన్యం, జమ్ము కశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG) సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టిన బృందం గాలింపులు చేపట్టాయి.
అయితే, ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సైనికుడు గాయపడ్డాడు. గాయపడ్డ సైనికుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు అధికారులు తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో శుక్రవారం రాత్రి నుంచి మోహరించినట్లుగా అధికారులు పేర్కొన్నారు. శనివారం ఉదయం మళ్లీ సంయుక్త ఆపరేషన్ తిరిగి ప్రారంభించినట్లు చెప్పారు. అటవీ ప్రాంతంలో ఇద్దరు నుంచి ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్లుగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో డ్రోన్స్, స్నిఫర్ డాగ్లు, అదనపు దళాలతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. అయితే, ఇప్పటి వరకు ఉగ్రవాదులతో కాల్పులు జరుగలేదని అధికారులు వివరించారు.
#WATCH | Udhampur, J&K: Security tightened in Udhampur district, especially on Jammu-Srinagar National Highway, after an encounter broke out between security forces and terrorists in Seoj Dhar area of Udhampur District, at Doda-Udhampur Border last evening.
(Visuals deferred by… pic.twitter.com/YP2uB8UtMd
— ANI (@ANI) September 20, 2025