అహ్మదాబాద్: భారత తొలి సోలార్ మిషన్ ‘ఆదిత్య ఎల్1’ వచ్చే నెల 6న గమ్యస్థానానికి చేరుకుంటుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ శుక్రవారం తెలిపారు. కచ్చితంగా ఏ సమయంలో ఆ స్థానంలోకి ప్రవేశిస్తుందో తగిన సమయంలో వెల్లడిస్తామని చెప్పారు.
శుక్రవారం విజ్ఞాన భారతి సంస్థ నిర్వహించిన భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్లో ఆయన ఈ విషయం వెల్లడించారు. ఆదిత్య ఎల్1ను సెప్టెంబర్ 2న శ్రీహరికోటనుంచి ప్రయోగించారు.