AICTE | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: జనాభా పెరుగుదలతో ప్రతికూల ప్రభావాలు ఉంటాయని ‘ది ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్'(ఏఐసీటీఈ) అభిప్రాయపడింది. జనాభా విస్ఫోటంతో ఆహార అభద్రతతో పాటు సామాజిక, రాజకీయ అస్థిరత ఏర్పడుతుందని పేర్కొన్నది. ఈ మేరకు జనాభా పెరుగుదల, దాని ప్రతికూల ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్ని ఇంజినీరింగ్ కాలేజీలు, సాంకేతిక విద్యాసంస్థలను తాజాగా ఆదేశించింది.
భారత్ ఈ ఏడాది ఏప్రిల్లో చైనాను దాటేసి ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన దేశంగా నిలిచిన విషయం తెలిసిందే. ఏప్రిల్లో ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన డాటా ప్రకారం భారత్లో 142.86 కోట్ల మంది జనాభా ఉన్నారు. తర్వాతి స్థానంలో 142.57 కోట్లతో చైనా ఉన్నది.