ఉత్తరాదిని మంచు దుప్పటి కప్పేసింది. జమ్ముకశ్మీర్, హిమాచల్ప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో మంచు వర్షం కురుస్తున్నది. దీంతో సాధారణ జన జీవనానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హిమాచల్ రోడ్లపై మంచు పేరుకుపోవడంతో మూడు జాతీయ రహదారులతో సహా 450కి పైగా రోడ్లను మూసివేశారు. కశ్మీర్ యూనివర్సిటీలో పరీక్షలను కూడా వాయిదా వేశారు.