కోజికోడ్: కేరళలో ఎన్ఆర్ఐ వ్యాపారి(NRI Bussinesman) మహమ్మద్ షఫీ అదృశ్యం కేసు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. కోజికోడ్ జిల్లాలోని తమరసరేకు చెందిన ఆ వ్యాపారి తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశాడు. సౌదీ నుంచి 325 కేజీల దొంగలించిన బంగారాన్ని స్మగ్లింగ్(Gold Smuggling) చేసినట్లు అతను ఆ వీడియోలో తెలిపాడు. కొంత మంది వ్యక్తులు గత వారం షఫీని అపహరించిన విషయం తెలిసిందే. సోదరుడితో కలిసి సుమారు 80 కోట్ల విలువైన బంగారాన్ని సౌదీ నుంచి తెచ్చినట్లు షఫీ తన వీడియోలో పేర్కొన్నాడు. అయితే ఆ 80 కోట్లలో షేర్ ఇవ్వాలని కోరుతూ తనను కిడ్నాప్ చేశారని వీడియోలో షఫీ తెలిపాడు. బంగారం స్మగ్లింగ్తో సంబంధం ఉన్న హవాలా లావాదేవీలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షఫీ కిడ్నాప్ కేసులో ఇప్పటికే ఇద్దర్ని అరెస్టు చేశారు.