పాట్నా, జూన్ 19: బీహార్లోని పాట్నాలో ఢిల్లీ వెళ్లేందుకు రన్వే నుంచి అప్పుడే ఎగిరిన స్పైస్ జెట్ విమానానికి మంటలు అంటుకోవడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ల్యాండ్ కావడానికి ముందు కొద్ది నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టింది. అయితే ప్రయాణికులెవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. టేకాఫ్ అయిన కాసేపటికే ఏదో పక్షి విమానానికి తాకడంతో మంటలు చెలరేగాయి. విషయాన్ని గమనించిన పైలట్లు.. ఇంజిన్ ఆపేసి సురక్షితంగా ల్యాండ్ చేశారు.