Aishwarya Rai | ఐశ్వర్యరాయ్ లాంటి కళ్లు కావాలంటే రోజూ చేపలు తినాలంటూ ఓ మంత్రి నోరుజారారు. మహారాష్ట్ర మంత్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. పలువురు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ధూలే జిల్లాలోని అంతుర్లీ గిరిజన మత్స్యకారులకు చేపల వేట సామగ్రిని పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మత్స్యకారులను ఉద్దేశించి గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి విజయ్ కుమార్ గవిత్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘రోజూ చేపలు తినండి. చర్మం మృదువుగా మారుతుంది. కళ్లు మెరుస్తాయి. ఎవరైనా మిమ్మల్ని చూసి ఆకర్షనకు గురవుతాడు. ఐశ్వర్యరాయ్ గురించి నేను మీకు చెప్పనా? ఆమె మంగళూరులోని బీచ్ సమీపంలో నివసించేది.
ఆమె రోజూ చేపలు తినేది. మీరు ఆమె కళ్లు చూశారా? చేపలు తింటే మీకూ ఆమెలాగా కళ్లుంటాయి. చేపల్లో కొన్ని నూనెలుంటాయి. అవి మీ చర్మాన్ని మృదువుగా మారుస్తాయి’ అంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా మంత్రి కుమార్తె హీనా గవిత్ బీజేపీ తరఫున లోక్సభలో ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ ప్రకటనపై పలువురు నేతలు అసహనం వ్యక్తం చేయగా.. పలువురు విమర్శలు గుప్పించారు. మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు మాని గిరిజనుల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. మరో బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే స్పందిస్తూ ‘నేను రోజు చేపలు తింటాను. నా కళ్లు కూడా అలాగే ఉండాలి. దీనిపై ఏమైనా పరిశోధన ఉందా? అనే విషయంపై మంత్రిని ప్రశ్నిస్తా’నన్నారు.