న్యూఢిల్లీ: మనిషి ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. నిద్రలేమి వల్ల తలెత్తే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. రోజూ 3 నుంచి 5 గంటలపాటు మాత్రమే నిద్రపోయేవారికి టైప్-2 డయాబెటిస్ ముప్పు అధికంగా ఉంటుందని, దీర్ఘకాలిక నిద్రలేమిని కేవలం పండ్లు, కాయగూరల్లాంటి ఆరోగ్యకరమైన ఆహారంతో భర్తీ చేయలేమని స్వీడన్లోని ఉప్సల యూనివర్సిటీ పరిశోధకుల బృందం తమ అధ్యయనంలో తేల్చింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రోజూ కంటినిండా నిద్రపోవడం అందరికీ సాధ్యం కాదని తెలుసని, అయినప్పటికీ నిద్రకు తగిన ప్రాధాన్యమివ్వాల్సిందేనని పరిశోధకులు తెలిపారు.