చంఢీగఢ్, నవంబర్ 22: చాలాకాలంగా పెండింగ్లో ఉన్న రైతుల డిమాండ్లను పరిష్కరించాలని కోరు తూ ఈ నెల 26 నుంచి దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు ఆందోళన చేపడతామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రకటించింది.
పెండింగ్ సమస్యలపై ఈ ఆందోళన నిర్వహిస్తున్నట్టు భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు జోగిందర్ సింగ్ తెలిపారు. ఆందోళనలో గవర్నర్ నివాసాన్ని ముట్టడించాలని, పోలీసులు అడ్డుకుంటే అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టాలని ఆయన రైతులను కోరారు.