Road Accident | ఏపీ కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను బస్సు ఢీకొట్టగా.. ఆరుగురు మహిళలు మృతి చెందారు. తాళ్లరేవు మండలం సీతారామపురం సుబ్బరాయునిదిబ్బ వద్ద ఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనలో మరో నలుగురు గాయపడగా.. కాకినాడ జీజీహెచ్కు తరలించి, చికిత్స అందిస్తున్నారు. మృతులంతా రొయ్యల పరశ్రమలో పనిచేసే వారిగా గుర్తించారు. పరిశ్రమలో పని చేసి ఆటోలో తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులు యానాంలోని నీలపల్లికి చెందినవారిగా గుర్తించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.