రాంచి: జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ సహా తొమ్మిది మందితో వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఆ తర్వాత పలు ఫల్టీలు కొడుతూ రోడ్డు పక్కన చెట్టును ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు అక్కడికక్కడే మరణించగా మరొకరు చికిత్స పొందుతూ మృతిచెందారు.
మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులంతా ఆదిత్యపూర్ వాసులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉందని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
#WATCH | Jamshedpur accident | Officer-in-charge Anjani Tiwari says “An accident took place near Circuit House under Bishtupur Police Station area, at 5:15 am this morning. Three injured people were admitted to MGM Hospital. They are undergoing treatment. The reason for the… pic.twitter.com/ebRoHiVSi5
— ANI (@ANI) January 1, 2024