కోల్కతా: పశ్చిమబెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తర దినాజ్పుర్లో ఓ బస్సు చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో ఆరుగురు కూలీలు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ప్రయాణికులతో ఓ బస్సు జార్ఖండ్ నుంచి లక్నో వెళ్తున్నది. ఈ క్రమంలో బుధవారం రాత్రి 10.45 గంటల సమయంలో పశ్చిమబెంగాల్లోని రాయిగంజ్ వద్ద 34వ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టింది.
అప్పటికీ ఆగని బస్సు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకున్నారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.