లక్నో : ఉత్తరప్రదేశ్ డిఒరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గౌరీబజార్-రుద్రాపూర్ రోడ్డులోని ఇందూపూర్ కాళీ మందిర్ మలుపు సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఎస్యూవీ, బస్సు ఢీకొట్టుకున్న ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. రాత్రి 11.30 గంటల సమయంలో ప్రయాణికులతో ఎస్యూవీ రుద్రపూర్ రోడ్ మీదుగా వస్తున్న సమయంలో కాళీ ఆలయం వద్దకు రాగానే.. ఎదురుగా వచ్చిన బస్సు ఎస్యూవీని ఢీకొట్టిందని డిఒరియా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీపతి మిశ్రా తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలంలోనే ఐదుగురు మృతి చెందగా.. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు.