జైపూర్: జువైనల్ హోమ్ గోడ పగులగొట్టి ఆరుగురు పిల్లలు పారిపోయారు. అడ్డుకోబోయిన సెక్యూరిటీ గార్డ్ను కిందకు తోసి అక్కడి నుంచి తప్పించుకున్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఈ సంఘటన జరిగింది. ఆదర్శ్ నగర్ ప్రాంతంలోని పిల్లల సంస్కరణ కేంద్రం నుంచి ఆరుగురు పిల్లలు తప్పించుకున్నారు. మంగళవారం రాత్రి 11 గంటలకు ఆ కేంద్రం గోడకు కన్నంపెట్టి అందులోంచి బయటపడ్డారు. పారిపోయేందుకు ప్రయత్నించగా విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డు అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఆరుగురు బాల నేరస్థులు ఆ సెక్యూరిటీ గార్డ్ను కిందకు తోసేశారు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు.
మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది జువైనల్ హోమ్కు చేరుకున్నారు. ఆ కేంద్రం గోడకు కన్నం ఉండటాన్ని గమనించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. పిల్లల సంస్కరణ కేంద్రం నుంచి తప్పించుకున్న ఆరుగురు పిల్లలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రిఫార్మ్ హోమ్లో భద్రతా వైఫల్యాలపై దర్యాప్తు చేస్తున్నారు.