ఆనంద నిలయం అమ్మలాంటిది
వృద్ధులను నిర్లక్ష్యం చేయొద్దు
సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి
ప్రభుత్వ ముఖ్య సలహాదారు కేవీ రమణాచారి
కొండపాక, మార్చి 23 : పెంచి, విద్యాబుద్ధులు అందించి, మంచి భవిష్యత్ ఇచ్చిన తల్లిదండ్రులకు సేవ చేయడం పిల్లల బాధ్యత అని, పెద్దలపై ప్రేమ, ఆప్యాయత కలిగిన వారే నిజమైన ధనవంతులని ప్రభుత్వ ముఖ్య సలహాదారు కేవీ రమణాచారి అన్నారు. కొండపాక ఆనంద నిలయం వృద్ధాశ్రమానికి హైదరాబాద్కు చెందిన రామ్కీ ఫౌండేషన్ అందజేసిన అంబులెన్స్ వాహనాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తల్లిదండ్రులు ప్ర త్యక్ష దైవాలని, వారిని ఎప్పుడూ మరిచిపోవద్దన్నారు. వృద్ధులను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. వృద్ధులతో కాసింత ప్రేమ, ఆప్యాయతలతో మాట్లాడితే ఎంతో సంతోషిస్తారన్నారు. వృద్ధాశ్రమాలు మన దగ్గర చాలా పెరిగిపోతున్నాయని, మన దేశం వృద్ధాశ్రమాలకు నిలయాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశా రు. 40ఏండ్లుగా అనేక సామాజిక కార్యక్రమాల తో ఎంతో మందికి అండగా నిలిచిన రామ్కీ ఫౌండేషన్ వృద్ధులు, అనాథ పిల్లల కోసం అంబులెన్స్ను అందజేయడంపైరామ్కీ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అ యోధ్య రామ్రెడ్డి, మేనేజింగ్ ట్రస్టీ ఆళ్ల దాక్షాయణిని ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణలో అరుదైన వృద్ధాశ్రమాల్లో ఒకటైన ఆనంద నిలయం అనుబంధాలకు నిలయంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆనం ద నిలయం ట్రస్టు చైర్పర్సన్ లతా రమణాచారి, ట్ర స్టు ప్రతినిధులు పెద్ది వైకుంఠం, గట్టు రవీందర్, వెనిశెట్టి రాజమౌళిగుప్తా, నాయకులు గంప మహేందర్రా వు, జగదీశ్, వృద్ధులు, అనాథ బాలలు పాల్గొన్నారు.
ఆనంద నిలయం ఆవరణలో అష్టాదశ శక్తిపీఠ సహిత రామలింగేశ్వరాలయం
దేశంలో ఎక్కడా లేని విధంగా ఆనంద నిలయం ఆవరణలో అష్టాదశ శక్తిపీఠ సహిత రామలింగేశ్వరాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేవీ రమణాచారి తెలిపారు. ఈ సంవత్సరంలోనే ప్రతిష్ఠాపన క్యాక్రమాలు పుష్పగిరి పీఠాధిపతి పర్యవేక్షణలో జరుగుతాయన్నారు. సిద్దిపేటకు చెందిన రామ్ రాజేశం రూ.కోటికి పైగా ఆలయ నిర్మాణం కోసం సహాయం చేశారని తెలిపారు. ఆలయం పూర్తయిన తర్వాత దేశమంతా ఆనంద నిలయంలో కొలువైన అష్టాదశ శక్తి పీఠం వైపు చూస్తదన్నారు. ఆనందం నిలయంలో అటు వృద్ధాశ్రమం, ఇటు బాల సదన్ సమీపంలోనే సత్యసాయి బాలికల విద్యాసంస్థలు ఏర్పాటు కావడం ఈ ప్రాంతానికి అదృష్టమైన విషయమన్నారు.