అమృత్సర్, జనవరి 19: సింగపూర్కు చెందిన స్కూట్ ఎయిర్లైన్స్ 32 మంది ప్రయాణికులను అమృత్సర్ విమానాశ్రయంలోనే వదిలేసి టేకాఫ్ అయ్యింది. దీనిపై డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు ఫిర్యాదు అందగా, విచారణకు ఆదేశించింది. పంజాబ్లోని అమృత్సర్ విమానాశ్రయం నుంచి రాత్రి 7.55 గంటలకు సింగపూర్ బయలుదేరాల్సిన విమానం మధ్యాహ్నం 3.45గంటలకే వెళ్లిపోయింది. దీంతో 32 మంది ప్రయాణికులు ఫ్లైట్ మిస్సయ్యారు.
ఆగ్రహానికి గురైన వారు అక్కడే నిరసనకు దిగారు. దీనిపై ఎయిర్లైన్స్ సిబ్బందిని ఎయిర్పోర్టు అధికారులు ప్రశ్నించగా, ప్రయాణికులకు ముందస్తుగానే సమాచారం ఇచ్చామని వెల్లడించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం షెడ్యూల్ మార్చామని, దీనికి సంబంధించిన సమాచారాన్ని ట్రావెల్ ఏజెంట్లకు చేరవేసినట్టు చెప్పారు. అయితే, ఒక ట్రావెల్ ఏజెంట్ ప్రయాణికులకు సమాచారం ఇవ్వడంలో విఫలమయ్యాడని, దీంతో 32 మంది సమయానికి రాలేకపోయారని వివరించారు.