Sidhu Moose Wala | ప్రముఖ పంజాబీ గాయకుడు (Punjabi singer), కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా (Sidhu Moose Wala) హత్య కేసులో మరో కీలక నిందితుడిని ఢిల్లీ పోలీస్ ప్రత్యేక సెల్ భారత్ కు తీసుకొచ్చింది. హత్య తర్వాత విదేశాలకు పారిపోయిన సచిన్ బిష్ణోయ్ (Sachin Bishnoi) ను అజర్ బైజాన్ (Azerbaijan) నుంచి మంగళవారం స్వదేశానికి రప్పించింది. ఈ మేరకు ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (Special Commissioner of Police) హరగోబిందర్ సింగ్ ధాలివాల్ వివరాలు వెల్లడించారు.
కరుడుగట్టిన నేరస్థుడు లారెన్స్ బిష్ణోయ్ మేనల్లుడు అయిన సచిన్ బిష్ణోయ్ (Lawrence Bishnoi).. మూసేవాలా మరణానికి ప్రధాన కుట్రదారుల్లో ఒకరు. హత్య తర్వాత సచిన్ బిష్ణోయ్ పరారయ్యాడు. నకిలీ పాస్ పోర్ట్ ఉపయోగించి దేశం విడిచి పారిపోయాడు. అప్పటి నుంచి అతడిని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ కు చెందిన ఇద్దరు ఇన్ స్పెక్టర్లతో సహా నలుగురు అధికారులతో కూడిన జాయింట్ టీమ్ సచిన్ బిష్ణోయ్ ను భారత్ కు తీసుకొచ్చే బాధ్యతను తీసుకుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రికి అజర్ బైజాన్ కు చేరుకున్న ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ (Delhi Police Special Cell).. సచిన్ బిష్ణోయ్ ని మంగళవారం స్వదేశానికి తీసుకొచ్చింది.
గతేడాది కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన సిద్ధూ మూసేవాలా.. మే 29న దారుణ హత్యకు గురయ్యారు. స్నేహితులతో కలిసి మాన్సా జిల్లాలోని తన స్వగ్రామానికి కారులో వెళ్తుండగా.. కొందరు దుండగులు అడ్డగించి కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన సిద్ధూ అక్కడికక్కడే మృతి చెందారు. సిద్ధూ హత్య వెనుక గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హస్తం ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ కేసులో కొందరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఇద్దరు నిందితులు గతేడాది జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందగా.. మరో ఇద్దరు జైలులో జరిగిన ఘర్షణలో మరణించారు. ఇద్దరూ పరస్పరం పదునైన ఆయుధాలతో దాడి చేసుకుని ప్రాణాలు కోల్పోయారు.
Also Read..
Elon Musk | మస్క్ కు షాక్.. ఎక్స్ ప్రధాన కార్యాలయంపై ఉన్న X లోగో తొలగింపు
Ukraine | జెలెన్ స్కీ స్వస్థలంపై రష్యా ప్రతీకార దాడి.. చిన్నారి సహా ఆరుగురు మృతి
Joe Biden | షర్ట్ లేకుండా బీచ్ డేని ఆస్వాదిస్తున్న అమెరికా అధ్యక్షుడు.. పిక్ వైరల్