పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ ఒక్క సారిగా యూటర్న్ తీసుకున్నారు. రాహుల్ గాంధీకి జై కొట్టారు. కొన్ని రోజుల నుంచీ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై సిద్దూ సంచలన వ్యాఖ్యలు చేస్తూనే వున్నారు. ఓ రకంగా సీఎం చెన్నీ, అధిష్ఠానం తీసుకోబోయే నిర్ణయాలకు వ్యతిరేక కామెంట్లు చేస్తున్నారు. ఆదివారం రాహుల్ గాంధీ పంజాబ్లో పర్యటించనున్నారు. సీఎం అభ్యర్థిని కూడా ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో సిద్దూ ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. సీఎం విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటానని తేల్చి చెప్పారు.
పదవుల కోసం తాను రాజకీయాల్లో లేనని, మార్పు కోసమే రాజకీయాల్లో వున్నానన్నారు. పార్టీ అధిష్ఠానం మాటే నా మాట అని ప్రకటించారు. చివరి శ్వాస వరకూ తాను కాంగ్రెస్లోనే వుంటానని, తనను ముఖ్యమంత్రి చేసినా, చేయకపోయినా కాంగ్రెస్లోనే వుంటానని సిద్దూ తేల్చి చెప్పారు. పదవుల కోసం రాజకీయాల్లో లేను. మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చా. పార్టీ హైకమాండ్ నిర్ణయమే నా నిర్ణయం. నా తుది శ్వాస వరకూ కాంగ్రెస్లోనే. ముఖ్యమంత్రిగా ప్రకటించినా, ప్రకటించకపోయినా కాంగ్రెస్తోనే నా ప్రయాణం అని సిద్దూ ప్రకటించారు.