న్యూఢిల్లీ, నవంబర్ 28: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్యకేసులో నిందితుడు ఆఫ్తాబ్పై పలువురు దాడికి యత్నించారు. ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్ వెలుపల సోమవారం ఈ ఘటన జరిగింది. ఫోరెన్సిక్ పరీక్షల అనంతరం ఆఫ్తాబ్ను జైలుకు తరలిస్తుండగా కొందరు వ్యక్తులు కత్తులతో పోలీస్ వ్యాన్పై దాడికి యత్నించారు. పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు, శ్రద్ధావాకర్ హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. శ్రద్ధవాకర్ను ముక్కలుగా నరికేందుకు నిందితుడు ఆఫ్తాబ్ అమిన్ పూనావాలా వినియోగించిన కత్తిని సోమవారం స్వాధీనం చేసుకొన్నారు. అలాగే, పూనావాలా వేరే మహిళకు ఇచ్చిన శ్రద్ధావాకర్ ఉంగరాన్ని కూడా స్వాధీనం చేసుకొన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.