Gujarat | గుజరాత్లో జరిగిన ఓ సంగీత కచేరీలో అభిమానులు నోట్ల వర్షం కురిపించారు. నవసారి జిల్లా సూప గ్రామంలో స్వామి వివేకానంద ఐ మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారు కళాకారుల ప్రదర్శనకు మంత్రముగ్ధులయ్యారు. వారిపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు. గాయకుడు కీర్తిదాన్ గధ్విపై డబ్బులు వెదజల్లారు. కార్యక్రమం ద్వారా మొత్తం రూ.50లక్షల మేర సమకూరింది.
నేత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి కోసం విరాళాలు సేకరించే ఉద్దేశంతో ఈ సంగీత కచేరి నిర్వహించామని.. కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బును కంటి సమస్యలు ఉన్నవారి చికిత్స కోసం ఉపయోగిస్తామని వారు తెలిపారు. కాగా, సంగీత కచేరిలో అభిమానులు డబ్బులు వెదజల్లుతున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Gujarat | A bhajan program was organised in Supa village by the Swami Vivekananda Eye Mandir Trust for the collection of donations for the welfare of people who need eye treatment. The program received donations of around Rs 40-50 lakh: Folk singer Kirtidan Gadhvi
(28.12) pic.twitter.com/MaOfc7v8dk— ANI (@ANI) December 28, 2022