న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం పార్లమెంట్ ఎన్నికల వరకే అయితే ‘ఇండియా’ కూటమి పొత్తును ముగించాలని సూచించారు. ఆ కూటమికి నాయకత్వం, ఎజెండా వంటివి ఏమీ లేకపోవడాన్ని ఆయన విమర్శించారు. ‘ఇండియా’ కూటమిలో భాగమైన ఆప్, కాంగ్రెస్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడంపై గురువారం మీడియా అడిగిన ప్రశ్నకు ఒమర్ అబ్దుల్లా సమాధానమిచ్చారు. ‘దీని గురించి నేను ఏమీ చెప్పలేను. ఎందుకంటే ఢిల్లీ ఎన్నికలతో మాకు సంబంధం లేదు. ఆప్, కాంగ్రెస్, క్షేత్రస్థాయిలో ఉన్న ఇతర పార్టీలు బీజేపీని ఎలా ఎదుర్కోవాలో నిర్ణయించుకోవాలి’ అని అన్నారు.
కాగా, తనకు తెలిసినంత వరకు ‘ఇండియా’ బ్లాక్కు ఎలాంటి కాలపరిమితి లేదని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు కూటమి సమావేశాన్ని నిర్వహించడం లేదని చెప్పారు. దీంతో కూటమి నాయకత్వం, ఎజెండా, ఉనికి గురించి తనకు స్పష్టత లేదని అన్నారు. ‘అది (ఇండియా బ్లాక్) కేవలం పార్లమెంట్ ఎన్నికల కోసమే అయితే వారు కూటమిని ముగించాలి’ అని సూచించారు.
#WATCH | Jammu: J&K CM Omar Abdullah says, “… I cannot say anything about what’s going on in Delhi because we have nothing to do with Delhi Elections… As far as I remember, there was no time limit to the INDIA alliance. Unfortunately, no INDIA alliance meeting is being… pic.twitter.com/u9w9FazeJG
— ANI (@ANI) January 9, 2025