రైల్వే స్టేషన్లో నిలబడి ఉన్న రైల్వే కానిస్టేబుల్.. ఉన్నట్లుండి కళ్లు తిరిగి రైలు కింద పడిపోయాడు. ఈ షాకింగ్ ఘటన ఆగ్రాలోని రాజా కీ మండి రైల్వే స్టేషన్లో వెలుగు చూసింది. ఇక్కడ శనివారం రాత్రి డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ రింగల్ కుమార్.. స్టేషన్లో ఉన్నాడు.
ఒక గూడ్సు రైలు వెళ్తుండగా ప్లాట్ఫాంపై ఉన్నాడతను. రైలుకు సుమారు 5-6 అడుగుల దూరంలో ఉండి పరిసరాలను గమనిస్తున్నాడు. ఇంతలో ఏమైదో కళ్లు తిరిగినట్లు రెండు సార్లు తన చుట్టూ తానే తిరిగాడు. ఆ తర్వాత బ్యాలెన్స్ కోల్పోయి తూలుకుంటూ వెళ్లి గూడ్స్ రైలు కింద పడిపోయాడు.
ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజి బయటకు రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. మరణించిన కానిస్టేబుల్ ఉత్తరప్రదేశ్లోని బిజనోర్ ప్రాంతానికి చెందిన వాడని, అతనికి భార్య, ఒక నెల వయసున్న పాప ఉన్నారని సమాచారం.
GRP जवान की बेहद दुःखद मृत्यु. वहाँ बैठे सज्जन की प्रतिक्रिया कितनी असंवेदनशील है, देखिए.💔 pic.twitter.com/nH0DZ1X5mn
— Awanish Sharan (@AwanishSharan) March 27, 2022