న్యూఢిల్లీ: ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఇండియన్ రెవన్యూ సర్విస్ అధికారి కుమార్తె(IRS Officer Daughter) అత్యంత దారుణంగా మర్డర్ అయ్యింది. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని అమర్ కాలనీ ప్రాంతంలో ఉన్న ఇంట్లో జరిగింది. పోలీసులు ఈ కేసులో దర్యాప్తు చేపడుతున్నారు. అనుమానాస్పద రీతిలో బాధిత యువతి మృతిచెంది ఉన్నట్లు ఇంట్లోవారు గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. బాధిత వ్యక్తిపై తొలుత లైంగికంగా దాడి చేసి, ఆ తర్వాత మర్డర్ చేసినట్లు అనుమానిస్తున్నారు. అయితే ఆ యువతిని చంపేందుకు నిందితుడు మొబైల్ ఫోన్ చార్జింగ్ వైర్ను వాడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
ఆ వైర్తో ఆమె గొంతుకు ఉరి వేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. మర్డర్కు గురైన అమ్మాయి వయసు 21 ఏళ్లు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు తెలిసింది. ఇంట్లో పనిమనిషి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. నెల రోజుల క్రితమే అతన్ని ఇంటి నుంచి తరిమేశారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.